హైదరాబాద్ : సికింద్రాబాద్, ఫలక్నుమా, శివరాంపల్లి రైల్వే లైన్లో శాస్త్రిపురం వద్ద ఆర్ఓబీ, ఆర్యూబీ గ్రేడ్ వేరు చేసే నిర్మాణ పనులు జరుగుతుండడంతో ఈ నెల 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు వట్టెపల్లి రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ వెల్లడించారు. వట్టెపల్లి రూట్లో మెహమూద హోటల్ నుంచి మైలార్దేవ్పల్లి మైఫిల్ హోటల్ జంక్షన్ వచ్చే రూట్లో వెళ్లే వాహనాలను ప్రత్యమ్నాయ రూట్లో వెళ్లాలని సూచించారు.
-మైలార్దేవ్పల్లి – అరాంఘర్ క్రాస్రోడ్డు – శాస్త్రిపురం రోడ్డు – వట్టేపల్లి రోడ్డు.
-వట్టెపల్లి రోడ్డు – శాస్త్రిపురం రోడ్డు – శివరాంపల్లి రైల్వే రోడ్డు – మైలార్దేవ్పల్లి.
-వట్టెపల్లి రోడ్డు – ఇంజన్బౌలి క్రాస్రోడ్డు – ఫలక్నుమా రోడ్డు – చాంద్రాయణగుట్ట – మైలార్దేవ్పల్లి.
-మైలార్దేవ్పల్లి – అరాంఘర్ క్రాస్రోడ్డు జంక్షన్ – శాస్త్రిపురం మెయిన్రోడ్డు – తాడ్బన్ జంక్షన్ – కాలా పత్తార్ రోడ్డు – శంషీర్గంజ్ జంక్షన్.