సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అబిడ్స్, జీపీఓ సర్కిల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.