హైదరాబాద్: నగరంలోని డబీర్పుర వంతెనపై గుంత ఏర్పడింది. పైవంతెనపై ఏర్పడిన గుంత కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ అంతరాయంతో ఇబ్బంది పడిన స్థానికులు ఈ పరిస్థితిని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. వంతెనపై బ్యారికేడ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ను మళ్లించారు. దీంతో పరిస్థితి కొంత మేర చక్కబడింది.