సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ప్రభావంతో గ్రేటర్లో శుక్రవారం రాత్రి మరోసారి వాన దంచికొట్టింది. పగలంతా చెమటలు కక్కించిన వాతావరణం ఒక్కసారిగా రాత్రి కురిసిన వర్షంతో కొంత చల్లబడింది.
రాత్రి 10.30గంటల వరకు నగరంలోని రాజేంద్రనగర్, మైలార్దేవ్పల్లిలో అత్యధికంగా 4.53సెం.మీలు, గోల్కొండ, శాస్త్రీపురంలో 4.48 సెం.మీలు, కిషన్బాగ్లో 4.05సెం.మీలు, పాతబస్తీ దూద్బౌలిలో 3.65 సెం.మీలు, అమీర్పేట మైత్రీవనంలో 3.23సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రుతుపవనాల ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు.