జూబ్లీహిల్స్, మే 24: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల గ్రేటర్లో రాగల రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
శుక్రవారం నగరంలో గరిష్ఠం 39.7, కనిష్ఠం 26.9 డిగ్రీల సెల్సియస్.. గాలిలో తేమ 43 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. కాగా, రెండు రోజులతో పోలిస్తే నగరంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత తప్పడం లేదు.