బన్సీలాల్పేట్, ఆగస్టు19 : పేదల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా గాంధీ దవాఖానలో రూ.52 కోట్లతో మాతా, శిశు ఆరోగ్య కేంద్రం నూతన భవనం నిర్మించింది. టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారా 200 పడకలతో ఈ భవనాన్ని 8 అంతస్తుల్లో నిర్మించారు. ఆదివారం ఉదయం 11:15 గంటలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్రావు ప్రారంభించనున్నారు. దాని పక్కనే రూ.2.70 కోట్లతో ఆధునిక సామగ్రితో కూడిన మోడర్న్ డైట్ కిచెన్ను కూడా మంత్రి ప్రారంభిస్తారు. ప్రత్యేక అతిథులుగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, మేయర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్, అధికారులు హాజరవుతున్నారని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు.