సిటీబ్యూరో, మార్చి 7 ( నమస్తే తెలంగాణ ) : మహా శివరాత్రి సందర్భంగా నగర వ్యాప్తంగా దేవాలయాలన్ని ముస్తాబయ్యాయి. భక్తులు వేకువ జాము నుంచే దేవాలయాలకు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దేవాలయాల వద్ద ఏర్పాట్లు చేశారు.
కీసరగుట్టు, ఏడుపాయల, బీరంగుట్ట జాతరకు తరలి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. రెజిమెంటల్ బజార్, అమ్ముగూడ, యాప్రాల్, ఈసీఐఎల్ బస్టాప్ల నుంచి కీసరగుట్టకు, సీబీఎస్, పటాన్ చెరు నుంచి ఏడుపాయల జాతరకు బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.