శామీర్పేట, సెప్టెంబర్ 20 : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలోని తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు యూరోఫిన్స్ సంస్థ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ హైదరాబాద్ క్యాంపస్లో యూరోఫిన్స్ బెల్జియమ్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి మంత్రి కేటీఆర్తోపాటు యూరోఫిన్స్ రీజినల్ డైరెక్టర్ నీరజ్ గర్గ్, డైరెక్టర్ ఆఫ్ యూరోఫిన్స్ రీజవ్ మాలిక్ హాజరుకానున్నట్లు తెలిపారు.