మాదాపూర్, ఆగస్టు 1: ‘భూ వివాదం పరిష్కరించుకుందాం’ అని పిలిచి ఒక రౌడీషీటర్ను తుపాకీతో, తన వ్యాపార భాగస్వామి కాల్చి చంపాడు. ఈ ఘటన లో మృతుడి వెంట ఉన్న వ్యక్తికి సైతం గాయాలయ్యా యి. సోమవారం తెల్లవారు జామున మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హంతకుడు, మృతుడు ఇద్దరు నేరస్థులే కావడం విశేషం. జై ల్లో పరిచయమై, బయటకు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యా పారం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బాలానగర్ డీసీపీ సందీప్ రావు, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్లతో పాటు స్థానికుల కథనం ప్రకారం.., కాలాపత్తర్లోని నవాబ్ సాబ్ కుంటలో ఉంటున్న మహమ్మద్ ఇస్మాయీల్(34) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. గతంలో పలు కేసులపై జైలుకు వెళ్లాడు. కాలాపత్తర్ పోలీస్స్టేషన్లో రౌడీషీట్ నమోదైంది.
దుం డిగల్లోని గండి మైసమ్మలో ఉంటున్న జిలానీ(37)కి కూడా నేర చరిత్ర ఉంది. జైలు నుంచి బయటకు వచ్చి యూసుఫ్గూడలో నివాసం ఉంటున్న ముజాయిద్దీన్ (36) అనే వ్యక్తితో కలిసి జహీరాబాద్ సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం జహీరాబాద్లోని రంజోల్ వద్ద మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమిని ఇస్మాయీల్, ముజాయిద్దీన్లు కలిసి జిలానీ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించగా, ఆ స్థలం లో వెంచర్ను చేశారు. ఈ వెంచర్ విషయంలో భాగస్వాముల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ జిలానీ ఇష్టానుసారంగా వ్యవహరించడం మొదలు పెట్టాడు. అయితే, జిలానీ అమ్మి న ప్లాట్లలో, తనకు వాటా ఇవ్వాలని ఇస్మాయీల్ అడగటంతో ఇద్దరి వివాదాలు తార స్థాయికి చేరాయి.
ఆదివారం రాత్రి 10 గంటలకు..
ఈ వివాదాలను పరిష్కరించుకుందామని జిలానీ, ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఇస్మాయీల్ను పిలిచాడు. ఇస్మాయీల్ తన స్నేహితుడైన జహంగీర్, గౌస్, అస్లంతో పాటు బయల్దేరి మాసబ్ ట్యాంక్ వరకు వచ్చాడు. అక్కడ అందరు కలుసుకున్నారు. జి లానీతో పాటు ముజాయిద్దీన్, ఫిరోజ్ కూడా ఉన్నారు. ఒక కారులో ఇస్మాయీల్, జిలానీ, ఫిరోజ్లు, మిగతా వాళ్లు ఇంకో కారులో ప్రయాణిస్తూ బంజారాహిల్స్, పంజాగుట్టతో పాటు నగరంలోని పలు ప్రాంతాలలో తిరుగుతూ చివరకు రాత్రి 12.30 గంటలకు మాదాపూర్లోని నీరూస్ జంక్షన్ వద్దకు చేరుకున్నారు. జంక్షన్కు 4 మీటర్ల దూరంలో జిలానీ, ఇస్మాయీల్లు కలిసి దాదాపు రెండున్నర గంటల పాటు మాట్లాడుకున్నారు. ఇద్దరు పెద్దగా అరుస్తూ ఘర్షణ వాతావారణంలో మా ట్లాడుకున్నారు. ఇంతలోనే జిలానీ తన వెంట తెచ్చుకున్న దేశీ తుపాకి తీసి ఇస్మాయీల్కు దగ్గరి నుంచి గురి పెట్టడం, దీంతో అక్కడ ఘర్షణ మరింత చోటు చేసుకుంది. వీరి వివాదాన్ని చూసిన జహంగీర్ సర్ది చెప్పేందుకు వారి మధ్యలోకి వెళ్తుండగానే జిలానీ తుపాకీతో ఇస్మాయిల్ తలపై కాల్చేశాడు. ఆపేందుకు ప్రయత్నించిన జహంగీర్ను గన్తో బలంగా తలపై కొట్టాడు. వెం టనే అక్కడున్న వారు ఇస్మాయీల్ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెం దాడు. గాయాలకు గురైన జహంగీర్ను దవాఖానలో చేర్పించారు. సాక్షి జహంగీర్ కోలుకున్న తరువాతే ఘ టనపై పూర్తి స్పష్టత వస్తుందని పోలీసులన్నారు.