హైదరాబాద్: హైదరాబాద్లోని పెట్ బషీరాబాద్ (Pet basheerabad) పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో (Accidents) ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొంపల్లి (Kompally) నుంచి మేడ్చల్ (Medchal) వైపు వెళ్తున్న కారు అతివేగంగా దూసుకువెళ్లి ఆగివున్న లారీని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ప్రమాదంలో.. దూలపల్లి నుంచి బహదూర్పల్లి వైపు బైకు ఎదురుగా వస్తున్న కారున ఢీ కొట్టింది. దీంతో మోటారుసైకిల్పై వెళ్తున్న యువకుడు మరణించాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. యవకుడిని సుశ్వంత్ నాయక్ (23)గా గుర్తించారు. అతడు ఎంఆర్సీఈటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్నాడని చెప్పారు.