శంషాబాద్ రూరల్, డిసెంబర్ 4: ముందుగా వెళ్తున్న బైక్ను వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన ఆదివారం పెద్దషాపూర్ వద్ద జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ కథనం ప్రకారం.. ఫరూఖ్నగర్ మండలంలోని కడియాలకుంట తండాకు చెందిన పాత్యావత్ గోపాల్(47), అతడి భార్య అంజలి (42), కూతురు స్వాతి(12) కలిసి మధ్యాహ్నం షాద్నగర్ వైపు నుంచి నగరంలోని చంపాపేటకు బైక్పై బయలుదేరారు. వీరి కూతురు చంపాపేటలోని ఓ హాస్టల్ ఉంటుంది.
ఇదిలా ఉండగా.. వీరు బైక్పై పెద్దషాపూర్ మీదుగా వెళ్తుండగా.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు. వీరంతా ఒకే కటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.