RGIA | హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టుకు బెదిరింపు మెయిల్స్ పంపుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు. విమానాల్లో హైజాకర్లు వచ్చారని గతంలో రెండు సార్లు శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెయిల్స్ పంపాడు నిందితుడు. ఆ మెయిల్స్ కారణంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. మెయిల్స్ నకిలీవి అని తేలడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరులో వైభవన్ను అరెస్టు చేశారు. కరోనా కారణంగా ఐటీ ఉద్యోగం పోయి డిప్రెషన్లో ఉండి మెయిల్స్ పంపానని వైభవ్ పోలీసులకు తెలిపాడు.