అంబర్పేట, ఆగస్టు 27 : ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్కు 57 ఏండ్లు నిండిన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సూచించారు. ఈ నెల 31వ తేదీలోపు మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఇంకా దరఖాస్తు చేసుకోలేని వారు తమ ఆధార్కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్బుక్కు, బర్త్ లేదా స్టడీ సర్టిఫికెట్, ఫొటోను తీసుకెళ్లాలని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.