హైదరాబాద్ : నగరంలో దొంగలు(Thieves) రెచ్చిపోయారు. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా పలు ఇండ్లలో చోరీలకు పాల్పడ్డారు. సికింద్రాబాద్లోని(Secunderabad) మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో(Mahankali Police Station) ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో తాళాలు పగలగొట్టి దుండగులు రూ.5లక్షలు, బంగారు ఆభరణాలుGold jewelery )ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేపట్టారు.
పూర్తి విరాలు తెలియాల్సి ఉంది. కాగా, మరోవైపు జగద్గిరిగుట్ట పరిధి ఎల్లమ్మ బండలో దొంగలు బీభత్సం సృష్టించారు. రూ.3లక్షలు, 17 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుస దొంగతనాలతో నగర ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. పోలీసులు గస్తీని ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు.