హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) మోగల్పురాలో (Mogalpura) దోపిడీ దొంగలు (Thief) బీభత్సం సృష్టించారు. బంగారు ఆభరణాలు తయారు చేసే ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు.. ఇంట్లో ఉన్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం బీరువాలోని లాకర్లను బద్దలుగొట్టి అందులో ఉన్న 300 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు (Robbery). బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.