బాలానగర్, అక్టోబర్ 29 : కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గెలుపు లాంఛనప్రాయమేనని ఓల్డ్బోయిన్పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే కృష్ణారావు గెలుపును కాంక్షిస్తూ ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. మూడో రోజు చాముండేశ్వరీ ఆలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కార్పొరేటర్ అమ్మవారిని దర్శించుకొని ఎమ్మెల్యే కృష్ణారావు అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని పూజలు చేశారు. అనంతరం ఎల్బీనగర్, చత్రిగడ్డ, వడ్డెరబస్తీ, పాముల బస్తీ, ఎస్సీబస్తీల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి పనులే ఆయన గెలుపునకు బాటలు వేస్తాయన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నరేందర్గౌడ్, మక్కల నర్సింగ్, సయ్యద్ ఎజాజ్, ఇర్ఫాన్, హారినాథ్, మట్టి శ్రీను, పోచయ్య, జహంగీర్ మహిళలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్లో…
బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం నవజీవన్నగర్, గీతనగర్ల్లో ఇంటింటికీ తిరిగి పార్టీ శ్రేణులతో కలిసి కరపత్రాలు పంచారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే కృష్ణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బాలానగర్ డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే కృష్ణారావు ఎంతో పాటుపడ్డాడని తెలిపారు. అనేక దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కృష్ణారావును గెలిపించుకుందాం..
– కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ
కేపీహెచ్బీ కాలనీ : అభివృద్ధి సంక్షేమం కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావును మరోసారి గెలిపించుకుంచుకోవాలని కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుపుకోసం మైత్రీనగర్, విజ్ఞాన్పురి కాలనీలలో కార్పొరేటర్ ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మదిన్నరేండ్ల కాలంలో కూకట్పల్లి నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించిందన్నారు. ప్రజా సమస్యలన్నింటిని పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండే కృష్ణారావును మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు వాసుదేవరావు, సంతోష్, ప్రభాకర్, బొట్టు విష్ణు తదితరులు పాల్గొన్నారు.