– 56 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
సికింద్రాబాద్ : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసూతి సహాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని, ఇంత గొప్ప సంక్షేమ పథకాలు ఇతర ఏ రాష్ట్రంలో లేవని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కార్కానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 56 మంది లబ్ధిదారులకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న కల్యాణలక్ష్మి చెక్కులను శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డల వివాహాలు పేద కుటుంబాలకు ఆర్థిక భారం కాకూడదన్న ఉద్దేశంలో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. దీంతో పేద కుటుంబాలు ఎంతో సంతోషంగా ఆడపిల్లల వివాహాలు చేయగలుగుతున్నాయని చెప్పారు. ప్రసవాలు ప్రభుత్వ దవాఖానలో జరిగితే ఒక్కో ప్రసవవానికి రూ.13 వేలు ఆర్థిక సహాయంతో పాటు కేసీఆర్ కిట్ను కూడా అందిస్తున్నారన్నారు.
కార్యక్రమంలో తిరుమలగిరి తాసీల్దార్ హాసీనాభేగం, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, నళినికిరణ్, లోక్నాథ్, శ్యామ్కుమార్, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు నివేదిత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, మాజీ డైరెక్టర్ మహంకాళి శర్విన్ తదితరులు పాల్గొన్నారు.