హైదరాబాద్: నగరంలో సెక్యూరిటీ లేని ఏటీఎంలను దొంగలు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లిలో (Cherlapally) ఉన్న ఏటీఎం చోరీకి దుండగులు ప్రయత్నించారు. అయితే మెషిన్లో డబ్బులు రాకపోవడంతో దానిని ధ్వంసం చేసి వెళ్లిపోయారు. చోరీ యత్నానికి సంబంధించి బ్రాంచి మేనేజర్కు ముంబై నుంచి ఫోన్లో సమాచారం అందించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎం కేంద్రం, దాని పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.