చిక్కడపల్లి,జనవరి21: యాదవుల పట్ల నిబద్ధత ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని పశుసంర్ధక,సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యాదవ ఆత్మ గౌరవ భవనం కోసం కోకాపేట్లో రూ.300 కోట్ల విలువైన స్థలంతో పాటు రూ. 5 కోట్ల నిధులు కూడా కేటాయించారని ఆయన పేర్కొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ న్యాయ విభాగం ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాదవ మహిళా న్యాయవాదులు, అధికారుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదవులతో పాటు బీసీ, ఎస్సీల భవనాల నిర్మాణం కోసం గతంలో ఏకాన నిధులు కూడా గత ప్రభుత్వాలు కేటాయించిన దిక్కులేదని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ బీసీ కులాల ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాకి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. మరో రెండు నెలల్లో యాదవ ఆత్మగౌరవ భవనం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భగత్ యాదవ్, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఆర్.రమేశ్ యాదవ్, ఆంధప్రదేశ్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరి ఉదయలక్ష్మి యాదవ్ , ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ సమాచార కమిషనర్ వర్రె వెంకటేశ్వర్లు, న్యాయవాది అచ్యుత్ యాదవ్, యాదవ్ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్,రాష్ట్రపతి భవన్ ఎస్టేట్ అధికారి రజనిప్రియా యాదవ్, అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ మహేశ్వరి యాదవ్, ఓయూ లా కాలేజీ ప్రిన్సిపాల్ రాధిక యాదవ్, మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు రాగం సుజాత యాదవ్, కార్పొరేటర్ శ్రీదేవి పాల్గొన్నారు.