సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ ) : ‘ముల్కనూరు ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో జాతీయస్థాయి కథల పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
మొత్తం 70మంది రచయితలను ఘనంగా సత్కరించారు. అందులో మొదటి బహుమతి ఒకరికి రూ.50వేలు, ద్వితీయ బహుమతులు ఇద్దరికి రూ.25వేలు, రూ.10వేల చొప్పున తృతీయ బహుమతులు-3, రూ.5వేల బహుమతులు-6, రూ.3వేల బహుమతులు-16, రూ.2వేల బహుమతులు-26 కాగా, ప్రత్యేక బహుమతులు-10, విశిష్ట కథకుల గుర్తింపు-6 బహుమతులు ఉన్నాయి.