సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రుతుపవనాల ఆగమనంతో గ్రేటర్ వాతావరణం కొంత చల్లబడింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.2డిగ్రీలు, గాలిలో తేమ 56 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో విస్తరిస్తున్న రుతుపవనాల ప్రభావంతో రాగల 36 గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.