కాచిగూడ, జనవరి 13: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని కూలీ మృతిచెందిన ఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య కథనం ప్రకారం.. కూలీ చేసుకుంటూ జీవనం సాగించే అలంపూర్ ప్రాంతానికి చెందిన లక్ష్మ య్య కుమారుడు బుచ్చయ్య శుక్రవా రం అర్ధరాత్రి తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వచ్చిన 09519 రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.