హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంచ చేపట్టినప్పటి నుంచి నగరంలో శాంతి భద్రతులు క్షీణిం చాయి. మర్డర్లు, దోపిడీలతో హైదరాబాద్ నగరంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. తాజగా ఇంట్లో ఉన్న ఓ మహిళను(Woman) గుర్తు తెలియని దుండగలు హత్య(Brutal murdered) చేశారు. వివరాల్లోకి వెళ్తే..జూబ్లీహిల్స్(Jubilee Hills) పీఎస్ పరిధిలో ఆర్ఎంపీ వైద్యుడు ఉమామహేశ్వరరావు భార్య సంధ్యా రాణి, పిల్లలతో స్థానికంగా నివాసం ఉంటున్నారు.
అయితే ఉమామహేశ్వరరావు క్లినిక్కు వెళ్లాడు. పిల్లలు ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి తండ్రికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దదవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.