హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి(Medchal malkajgiri) జిల్లాలో ఓ దొంగ రెచ్చిపోయాడు. ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసి కత్తితో దాడికి పాల్పడి(Thug attacked) బంగారు ఆభరణాలతో (Gold jewelry) పరారయ్యాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని అత్వెలిలో సోమవారం చోటు చేసుకుంది. అత్వెలిలోని ఎస్ఎల్ఆర్ వెంచర్లోని ఓ ఇంట్లో ముసుగుతో చొరబడిన దుండగుడు మహిళపై దాడి చేసి నగలతో పరారయ్యాడు. మహిళ ఫిర్యాదుతో మేడ్చల్ పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.