సిటీబ్యూరో : గ్రేటర్లో మళ్లీ ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో నగర వాతావరణం వేసవిని తలపిస్తున్నది. గతంలో ఇదే సమయంలో వర్షాభావ పరిస్థితులు ఎదురైన సందర్భాలు చాలా ఉన్నాయి. వర్షాలు కురవకపోయినా జూలై మా సంలో సాధారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30-32 డిగ్రీలు దాటవు. అయితే ప్రస్తుతం వాతావరణం లో నెలకొంటున్న మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.
నగరంలో గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు 34-36డిగ్రీల మధ్య నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరం లో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.4డిగ్రీలు, గాలిలో తేమ 48 శాతంగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.