మేడ్చల్, ఫిబ్రవరి1(నమస్తే తెలంగాణ) : చరిత్రలో నిలిచిపోయే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నదని రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ మండలం పోచారం, మేడిపల్లి మండలం కమలానగర్కాలనీలో అభివృద్ధి పనులు పూర్తయిన పాఠశాలలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు.
నిరుపేదలకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్న పాపాన పోలేదని, దీంతో ప్రభుత్వ పాఠశాలలన్నీ నిర్వీర్యం అయ్యాయని అన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ ఏర్పడిందని, ప్రతి బడిలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోతున్నదని చెప్పారు.
రూ.70 కోట్లతో పాఠశాలల అభివృద్ధి..!
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం రూ.70 కోట్లు మంజూరు చేసిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మొదటి దశలో 176 పాఠశాలల అభివృద్ధి జరుగుతున్నదని, రెండవ దశలో జిల్లాలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గంథ్రాయల సంస్థ చైర్మన్ దర్గా దయాకర్రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, డిప్యూటీ మేయర్ శివగౌడ్, అదనపు కలెక్టర్ అభిషేక్ అగ్యస్త, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.