మాదాపూర్, అక్టోబర్ 25: తండ్రితో గొడవపడి తీవ్ర మనస్థాపం చెందిన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారంలో నివాసం ఉంటున్నసంపత్ కుమార్ (45) క్యాబ్ డ్రైవర్గా చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 24వ తేదీన తండ్రికి సంపత్ రావుకు మధ్యలో క్యాబ్ విషయమై గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపంతో ఈ నెల 25వ తేదీన ఉదయం మాదాపూర్లోని దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సంపత్ క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న కంపెనీలో కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బంపదు తలెత్తి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.