బేగంపేట్ : ఆశా వర్కర్స్ అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని వాటికి వెల కట్టలేమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఆదివారం రాంగోపాల్పేట్ డివిజన్లోని పాన్ బజార్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆశా వర్కర్స్కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.
ముందుగా అదే సెంటర్లో వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 10 ఐసీయూ బెడ్ వార్డ్ ను ప్రారంభించారు. 33 లక్షల విలువ చేసే ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ తదితర పరికరాలను అందించిన సంస్థ నిర్వహాకులను మంత్రి తలసాని అభినందించారు.
ఈ సంధర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ…ఆసుపత్రిల అభివృద్ధి కోసం ఆత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయినా స్వచ్ఛంద సంస్థలు చేయూతనందించడం అభినందనీయమన్నారు.
ఇక్కడికి వచ్చే వారికోసం మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆసుపత్రిని దత్తత తీసుకోవాలని వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ ఉపాధ్యక్షుడు భూషన్రెడ్డిని కోరారు. ఆసుపత్రి అభివృద్ధి కోస ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం హైదరాబాద్ జిల్లాలోని 1385 మంది ఆశా వర్కర్స్కు కోటి 25 లక్షల రూపాయల వ్యయంతో స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట్, డిప్యూటీ వైద్యాధికారి వెంకటేశ్వర్లు, రాంగోపాల్పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.