సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాదాపు రెండు నెలల పాటు నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్లో తిరిగి ప్రారంభమైంది. జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) వెంకటాచారి ఆధ్వర్యంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంపై దృష్టి పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రజావాణిలో మొత్తం 17 దరఖాస్తులు స్వీకరించగా.. వాటిలో ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూమ్, తదితర ఫిర్యాదులు వచ్చాయని జిల్లా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్డీవో సూర్యప్రకాశ్, సికింద్రాబాద్ ఆర్డీవో రవికుమార్, జిల్లా ప్రణాళిక అధికారి సురేందర్, బీసీ సంక్షేమ అధికారి ఆశన్న, ఎస్సీ కార్పొరేషన్ అధికారి యాదయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.