శంషాబాద్ రూరల్, ఏఫ్రిల్ 17 : ఔటర్రింగ్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణలో నేరస్తుడిని ఆరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం పాలెం గ్రామానికి లక్ష్మయ్య, పద్మ దంపతులు వారి కూతురితో కలిసి 9ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి శంషాబాద్ పట్టణంలోని మధురనగర్ కాలనీలో నివాసముంటున్నారు.
ఈనెల 11న వారి కూతురు అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా 14 తేదీన సాయంత్రం ఔటర్రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కన డీటీడీసీ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సీసీపుటేజీలు, సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు వనపర్తి జిల్లా పాలేం గ్రామం అంబేద్కర్ నగర్కు చెందిన జి.విష్ణును అదుపులోకి తీసుకున్నారు. విచారించగా హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ శ్రీనివాస్, ఎస్సైలు సుమన్, తరుణ్కుమార్, సుశీల, సిబ్బందిని అభినందించారు.