హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను(MLA Raja Singh )ఫోన్లో(Phone calls) బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్(Arrest)చేశారు. నిందితుడు వసీమ్ను సైబర్ క్రైం పోలీసులు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, గతంలో కూడా పలుమార్లు ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వేర్వేరు నంబర్లతో ఫోన్లో వరుసగా కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, వాయిస్ మెసేజ్ కూడా చేసి బెదిరించారని రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయంత తెలిసిందే. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.