ఉప్పల్, జూలై 9 : మీ సమస్యలు తెలియజేయండి… పరిష్కార చర్యలు చేపడతాం… మీ కోసం.. మీ ఎమ్మెల్యే ..మీ ముందుకు వస్తున్నారని పేర్కొంటూ ఉప్పల్ ఎమ్మె ల్యే బేతి సుభాష్రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం రెండోరోజు చిలుకానగర్లో కొనసాగింది. చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్తో కలిసి ఆయన ఇంటింటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో కాలనీవాసులు, నేతలు, కార్యకర్తలు హాజరై మద్దతు తెలిపారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తూ, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రజల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ… వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి పలు ప్రజాసంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రతి కుటుంబం లబ్ధిపొందేలా అన్నివర్గా ల సంక్షేమానికి తోడ్పాటు అందిస్తుందన్నారు. ప్రజా సం క్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామన్నారు. కాలనీల్లో సమస్యలు తెలుసుకోవడంతో పా టు, ప్రజల బాధలు వింటూ, తక్షణ పరిష్కార చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
వినతిపత్రాలు స్వీకరిస్తూ..
చిలుకానగర్లో చేపట్టిన పాదయాత్రలో భాగంగా కాలనీవాసుల నుంచి సమస్యలు తెలుసుకుంటూ.. వారి నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తూ పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్రలో భాగంగా తక్షణం పరిష్కరించే సమస్యలను వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టేవిధం గా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. చిలుకానగర్ ప్రజల సమస్యలను తప్పక పరిష్కరిస్తామన్నారు.
చిలుకానగర్కు రుణపడి ఉంటాం..
ఉద్యమగడ్డ చిలుకానగర్ ప్రాంతానికి రుణపడి ఉంటానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కడుపులో పెట్టుకొ ని, బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన చిలుకానగర్ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. ఉద్యమ స్ఫూర్తిని కలిగిన చిలు కానగర్ ప్రజలకు తప్పక న్యాయం చేస్తామన్నారు. ఉద్యమ కారులు, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. చిలుకానగర్ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి బృహత్ప్రణాళికతో పనిచేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్రావు, నేతలు నెర్ధం భాస్కర్, జెల్లి మోహన్, బన్నాల ప్రవీణ్, గుడి మధుసూదన్రెడ్డి, పిట్టల నరేశ్ ముదిరాజ్, ఈరెల్లి రవీందర్రెడ్డి, ఐకాన్ మోహన్రెడ్డి, కొంపెల్లి రవీం దర్, ఆకటి బాల్రెడ్డి, రాజ్కుమార్, పండ్ల కిషన్, పరమే శ్, మేకల మధుసూదన్రెడ్డి, మహిళలు పాల్గొన్నారు.