ఖైరతాబాద్ : ‘స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ ఇలాంటి పథకం తీసుకురాలేదు….దేశంలోనే దళితులకంటూ ఓ ప్రత్యే క పథకాన్ని తీసుకువచ్చి విజయవంతంగా అమలు చేయడంలో సీఎం కేసీఆర్కు ఎవరూ సాటి రారు…దళితబంధు పథకాన్ని దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలు హర్షిస్తున్నారు….ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ప్రధాని అయితే అలాంటి పథకం దేశమంతటా అమలవుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు’.. అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం అన్నారు.
సోమాజిగూడ ప్రెస్క్లబ్లోమంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందు కు తీసుకువచ్చిన దళిత బంధును కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ స్వయంగా కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాశారని, ఈ పథకాన్ని అడ్డుకోవడమంటే తెలంగాణ దళితులను, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపర్చినట్లేనన్నారు.
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు 2014లో అధికారం రావడంతోనే దేశంలోని దళిత, గిరిజనుల అణచివేతను ప్రారంభించారన్నారు. రిజర్వేషన్లు అమలు కాకుండా చేసి, రాజ్యాంగాన్ని సమూలంగా తొలగించాలన్న కుట్రకు తెరలేపార న్నారు. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత,గిరిజనులకు ప్రత్యేక పథకాలు కాని, ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖ లాలు లేవని, ఆర్థికంగా, సామాజికంగా ఎదగకుండా చేయడంతో పాటు కేంద్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత మహిళలపై లైంగికదాడులు, దౌర్జన్యాలు, హత్యలు పెరిగాయన్నారు.
దళితబంధుపై మొదటి నుంచే కేంద్రంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఈటల రాజేందర్లు విషం కక్కు తూనే ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశంలోని అట్టడుగువర్గాల జీవితాలు మారుతాయని, అన్ని వర్గాలు బాగుపడుతాయని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ముందే పథకాన్ని ప్రవేశపెట్టారని, నిరంతరాయంగా నడిచే పథకాన్ని కోడ్ పేరుతో ఎన్నికల కమిషన్ అడ్డుకోవడం సరికాదన్నారు.
దళిత బంధుతో పాటు గిరిజన, బీసీ బంధు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పిస్తుంటే ఆ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడం ఇష్టం లేక కుట్రలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇక్కడి బీజేపీ నేతలపై యుద్దం తప్పదన్నారు.