సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ) : నిర్మాణ రంగంలో సత్వర అనుమతులే లక్ష్యంగా ప్రవేశపెట్టిన తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అఫ్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్బీపాస్) పకడ్బందీగా అమలు అవుతున్నది. నిర్ణీత సమయంలో దరఖాస్తులను పరిశీలించని అధికారులను గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు.
టీఎస్ బీపాస్ చట్టం ప్రకారం ప్రతి అధికారికి రూ. 1000 నుంచి రూ.3వేల వరకు జరిమానా విధించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన దరిమిలా 13 మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు, 11 మంది స్క్రూట్నీ ఆఫీసర్లు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 103 మంది అధికారులకు జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు.