సిటీబ్యూరో, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ) : రెండో దశ మెట్రో రైల్వే లైన్ ఒక గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని పోలీస్గ్రౌండ్లో ఈ నెల 9న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, చైర్మన్లు, అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
సభకు వచ్చే వాహనాల రూట్, పారింగ్ ఏర్పాట్లు, సీఎం సభ వద్దకు వచ్చే రూట్, బందోబస్తు ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించారు. అనంతరం మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద శంకుస్థాపన శిలాఫలకం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 9న ఉదయం 10గంటలకు సీఎం కేసీఆర్ మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో రైల్వే లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం అకడి నుంచి రాజేంద్రనగర్ పోలీస్ గ్రౌండ్కు చేరుకొని అకడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారని తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, జైపాల్ యాదవ్, కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎంఏయూబీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, జడ్పీ చైర్మన్ అనిత, కార్పొరేషన్ చైర్మన్లు రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేశ్, బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, డీసీపీలు శిల్పవల్లి, శ్రీనివాసరావు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఆనంద్ గౌడ్, సలాఉద్దీన్లోడి, జీవన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.