సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 39.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.3డిగ్రీలు, గాలిలో తేమ 43 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి అధికంగా నమోదవుతుండడంతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రజలు జాగ్రత్త చర్యలు పాటించాలని అధికారులు సూచించారు.