సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సెల్ఫోన్ అనేది ప్రస్తుతం మనిషికి శరీరంలో ఒక భాగమైపోయింది. దీనికి తోడు ఫోన్ను నేరుగా కాకుండా ఇయర్ ఫోన్స్ లేదా బ్లూ టూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా మాట్లాడటం లేదా మ్యూజిక్ వినడం నేడు సర్వ సాధారణమైపోయింది. ఎవరి చెవిలో చూసినా ఈ ఇయర్ ఫోన్స్ దర్శనమిస్తున్నాయి. అయితే పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు మన సౌలభ్యం కోసం రోజురోజుకు వస్తున్న కొత్త టెక్నాలజీ వల్ల లాభాల కంటే నష్టాలే అధికంగా ఉంటున్నాయి.
అవసరానికి మించి వాడటం వల్లే ఈ పర్యావసనాలు తలెత్తుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇయర్ ఫోన్స్, బ్లూటూత్లు వాడే వాళ్లు జర జాగ్రత్త..ఎక్కువ సమయం వాడితే చెవుడు తప్పదని హెచ్చరిస్తున్నారు గాంధీ ఈఎన్టీ వైద్యుడు డాక్టర్ శోభన్బాబు. ఇయర్ ఫోన్స్ అధికంగా వాడటం, ఎక్కువ ధ్వనిని వినడం వల్ల చెవిలోని వినికిడి నరాలు దెబ్బతింటాయని హెచ్చరిస్తున్నారు. 90 డెసిబుల్స్ కంటే ఎక్కువగా ధ్వని వింటే వినికిడి సమస్య వస్తుందంటున్నారు. సాధారణంగా ఏదైన శబ్ధాన్ని కాకియాలో ఉండే హెయిర్ సెల్స్ అనేటివి ఎలక్ట్రికల్ కరెంట్ కింద మార్చి మెదడుకు పంపుతాయని, దీని వల్ల మనం శబ్ధాలను వినగలుగుతామని, ఈ హెయిర్ సెల్స్ దెబ్బతినడం వల్ల వినికిడి సమస్య వస్తుందని డాక్టర్ శోభన్బాబు వివరించారు.
చెవులు శుభ్రం చేయాల్సిన అవసరం లేదు..
చెవిలోని సిక్రిషన్స్ (వ్యాక్స్) తనంతట అదే సహజంగానే బయటకు వచ్చేస్తుంది. దానికి సంబంధించిన మెకానిజం ప్రతి మనిషిలో స్వతహాగా ఉంటుంది. సహజంగా చెవిలోని సూపర్ ఫిషర్ లేయర్స్ అంటే చెవిలోని చర్మంపై ఉన్న పొరలు ఊడిపోయి కొత్త పొరలు వస్తుంటాయి. ఈ క్రమంలో చెవిలో ఉన్న వ్యాక్స్ కూడా తనంతట అదే తరచూ శుభ్రమవుతుంది. ఈ క్రమంలో చెవులు సహజంగానే నిరంతరం వాటంతట అవే శుభ్రమవుతుంటాయి. కాని ఇయర్ బడ్స్ వల్ల ఆ మెకానిజం దెబ్బతింటుంది. అందుకని ఇయర్ బడ్స్ను నిషేధించడం మంచిది.
– డాక్టర్ శోభన్బాబు, ఈఎన్టి విభాగాధిపతి, గాంధీ హాస్పిటల్
తీసుకోవాల్సిన జాగ్రత్తలు