సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ భూముల లీజు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించ డంతో పాటు, ఆర్టీసీ ఆస్తుల కోసం విలీనమంటూ.. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ… అధికారంలోకి రాగానే… గ్రేటర్ పరిధిలో ఉన్న విలువైన భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం టెండర్ నోటిఫికేష న్ విడుదల చేయగా, దీని ప్రకారం గ్రేటర్లో 39 ఎకరాలను ధారాద త్తం చేసేందుకు కార్యాచరణ అమ లైంది.
నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు గా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ జోన్ పరిధిలోని కాచిగూడ, మేడ్చల్, శామీర్పేట, హకీంపేట, చెంగిచెర్ల, రహీద్గూడ 1 అండ్ 2, తుర్కం యాంజల్ 1 అండ్ 2 ప్రాంతాల్లోని మొత్తం 39 ఎకరాల విస్తీర్ణంలో ఆర్టీసీ భూములను లీజు ప్రాతిపదికన అప్పగించనున్నారు. మార్చి 15 సాయంత్రం 4గంటల వరకు ఆన్లైన్ ద్వారా టెండర్ దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు.