ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 19: భగత్సింగ్ యూత్ ఫెస్టివల్లో భాగంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు డ్రగ్స్కు వ్యతిరేకంగా ‘సే నో టు డ్రగ్స్’నినాదంతో 2కే రన్ నిర్వహించారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది విద్యాసాగర్, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మూర్తి ముఖ్య అతిథులుగా హాజరై రన్ను ప్రారంభించి మాట్లాడారు. యువత డ్రగ్స్కు బానిస కాకుండా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రతీ పౌరుడిపై ఉందన్నారు.
మార్చి 23న సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగే భగత్సింగ్ యువజన ఉత్సవాలకు యువత అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్, జిల్లా కార్యదర్శి అశోక్రెడ్డి, నాయకులు జావెద్, శ్రీను, సాయికిరణ్, ఆనంద్శర్మ, కృష్ణ, రమ్య, సృజన, నాగేశ్వరి, నవ్యరెడ్డి, శ్రీమాన్ పాల్గొన్నారు.