Asha Workers | మైలార్దేవ్పల్లి, ఫిబ్రవరి 5: రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట సోమవారం తెలంగాణ ఆశ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 1080 మంది ఆశవర్కర్లు, ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్వో అందుబాటులో లేకపోవడంతో ఆఫీసు సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు జి.కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పి, రెండు నెలలుగా అమలు చేయడంలో విఫలమైందన్నారు. వెంటనే వేతనాలు చెల్లించకపోతే పీహెచ్సీ సెంటర్లలో విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి లలిత, జిల్లా ఉపాధ్యక్షులు శైలజ, ఆశ నాయకులు తదితరులు పాల్గొన్నారు.