ఎర్రగడ్డ, డిసెంబర్ 21 : ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తలుపులు బద్దలు కొట్టి కప్బోర్డులో ఉన్న బంగారు, వెండి నగల( jewelery)తో అగంతకులు ఉడాయించిన సంఘటన బోరబండ(Borabanda) పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బోరబండ ప్రాంతం ఎన్ఆర్ఆర్ పురం సైట్-1 కాలనీలో నివాసముంటున్న రమా మోహన్కుమార్ బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి పని మీద బయటకు వెళ్లారు.
వారు ఇంటికి తిరిగొచ్చే సరికి తలుపులు బద్దలైనట్లు గమనించారు. లోపలికి వెళ్లి చూడగా గదిలోని కప్బోర్డులో ఉన్న బంగారు, వెండి నగలు మామయ్యాయి. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ.2.5 లక్షలు ఉంటుంది. ఈ విషయమై బాధితులు గురువారం బోరబండ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.