పహాడీషరీఫ్ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వివాహిత అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ వివరాల ప్రకారం శ్రీరామకాలనీలో నివాసముంటున్న పింకి కుమారి (22) గృహిణి. 17న తెల్లవారు జామున 5 గంటలకు భర్త నిద్రలేచి చూడగా భార్య కనిపించలేదు.
ఇంట్లో సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. పలు చోట్ల ఆమె కోసం వెతికినా ఆచూకి లభించలేదు. భర్త సుబోత్ కుమార్ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.