హయత్నగర్, సెప్టెంబర్ 12 : సీఎం కేసీఆర్ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించేందుకు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి బండారి భాస్కర్ తెలిపారు.
ఆదివారం ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చాకలి ఐలమ్మ పోరాటాలను గుర్తించి ఆమె జయంతి, వర్ధంతులను అధికారికంగా జరిపేందుకు ప్రకటించడం హర్షనీయమన్నారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు యాదగిరి, శేఖర్, అశోక్ పగిళ్ల, శేఖర్ పగిళ్ల తదితరులు పాల్గొన్నారు.