మన్సూరాబాద్, ఆగస్టు 18 : ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహాయనిధి ద్వార పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నారని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం అన్నారు. నాగోల్ డివిజన్కు చెందిన జె. మంగమ్మ, జి. యాదగరి ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ నగరంలోని ప్రైవేటు దవాఖానల్లో వేరు వేరుగా చికిత్స పొందారు. చికిత్స ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్న ఇరువురి కుటుంబసభ్యులు విషయాన్ని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన ఆయన సీఎం సహాయనిధి ద్వారా చెక్కులను మంజూరు చేయించారు. చికిత్స ఖర్చులకు గాను జె. మంగమ్మకు మంజూరైన రూ. 60 వేలు, జి. యాదగిరికి మంజూరైన రూ. 27 వేల చెక్కును బుధవారం ఆయన నివాసం వద్ద బాధితులకు ఎమ్మెల్సీ అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు మంగమ్మ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.