చర్లపల్లి, ఏప్రిల్ 17 : సీఎం కేసీఆర్ సంక్షేమ పాలనపై బీజేపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఆ తప్పడు ప్రచారాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో అమలు కానీ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. ప్రభుత్వ సంస్థల ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ పాలన సాగించడంపై ప్రజలకు వివరించాలన్నారు. సోమవారం ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ మద్దురి గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ అత్మీ య సమ్మేళనాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరై మాట్లాడారు.
గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో ఏఎస్రావునగర్ డివిజన్లో 90 శాతం పనులు చేపట్టి పూర్తి చేశామ ని ఎమ్మెల్యే అన్నారు. డివిజన్లో ఇప్పటికే మంచినీటి పైప్లైన్, డ్రైనేజీ, రహదారుల నిర్మాణ పనులను పూర్తి చేశామన్నారు. అదే విధంగా కుషాయిగూడ శాంతివనం శ్మశానవాటికను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించామని, త్వరలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా డివిజన్లోని పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, డివిజన్లో సమస్యలు ఉంటే కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తన దృష్టికి తీసుకురావాలన్నారు.
నాయకులు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి స్పష్టం చేశారు. తొమ్మిది సంవత్సరాల ప్రభుత్వ పనితీరు, సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీని మరింత బలోపేతం చేయడంలో కార్యకర్తలు భాగ స్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, నాయకులు బేతాల బాల్రాజు, అనుముల నర్సింహారెడ్డి, శేర్ మణెమ్మ, మురళీపంతులు, సప్పిడి శ్రీనివాస్రెడ్డి, లక్ష్మీనారాయణ, శోభారెడ్డి, ఏనుగు సీతారామిరెడ్డి, బద్రుద్దీన్, యాకయ్య, శ్రీనివాస్గౌడ్, వెంకటహరి, బసవయ్య, మట్టగిరి, మొగులయ్య, కృష్ణ, శిరీషారెడ్డి, సజ్జ రామతులసీ, దుర్గా, సుహాసిని, సత్తెమ్మ, సాలెమ్మ, ప్రమీల, చంద్రమౌళి, వెంకటేశ్, వెంకటేశ్గుప్తా, అండ్రూస్, బద్దం భాస్కర్రెడ్డి, గడ్డం రవికుమార్, లేతాకుల రఘుపతిరెడ్డి, గరిక సుధాకర్, కాలనీ సంక్షేమ సం ఘాల అధ్యక్షులు తిరు మల్లయ్య, గణపతిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీరాములు, కొత్తపల్లి రాంబాబు, మోహన్, జగదీశ్, రహీం, శ్రీనివాస్, తోట నర్సింహా, దత్తు, సాయిరెడ్డి, చిన్నా యాదవ్తో కార్యకర్తలు, మహిళలు , నాయకులు పాల్గొన్నారు.