దుండిగల్, ఏప్రిల్ 8 : తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తున్నదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ శుక్రవారం శంభీపూర్లోని తన కార్యాలయంపై టీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుతో రాష్ట్ర రైతాంగం ఎంతో నష్టపోయిందని, ఇప్పటికైనా రైతుల నుంచి ధాన్యం సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాసాని వీరేశ్, పోలీస్ గోవింద్రెడ్డి, ధర్మారెడ్డి, భాస్కర్రెడ్డి, సమ్మయ్య నేత, మదాసు నవీన్, రంగయ్య, విష్ణువర్ధన్రెడ్డి, మహిపాల్రెడ్డి, బైండ్ల గోపాల్, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.