జవహర్నగర్, మార్చి 3: ప్రమాదవశాత్తు ఓ యువకుడు దమ్మాయిగూడ చెరువులో పడి మృతి చెందాడు. జవహర్నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజు కథనం ప్రకారం.. దమ్మాయిగూడ నివాసి జావత్ లక్ష్మణ్ (20) కూలీ. మద్యం మత్తుకు అలవాటుపడ్డాడు. ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికారు.
ఆచూకీ లభించలేదు. దమ్మాయిగూడ చెరువు సమీపంలో లక్షణ్ బైక్ ఉన్నదని స్థానికులు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా.. అది లక్ష్మణ్ బైక్ అని గుర్తించారు. చుట్టపక్కల చూడగా చెరువు గుంతలో శవమై కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.