హైదరాబాద్ బెంగాలీ సమితి ఆధ్వర్యంలో మంగళవారం దశమి సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో సంప్రదాయ సంబురంలో మహిళలు
సికింద్రాబాద్లోని కీస్ హైస్కూల్ ఆవరణలో భాగ్య సంస్కృతి సంగ్ ఆధ్వర్యంలో బెంగాలీ వారు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. “సింధూర కేళి” కార్యక్రమంలో భాగంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు కుంకుమ తిలకం దిద్దుకున్నారు. స్వీట్స్ పంచిపెట్టి ఆటపాటలతో అమ్మవారిని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియంలో బెంగాలీలు “సింధూర కేళి” కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.