హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్లో తెలంగాణ స్టేట్ టెన్నిస్ చాంపియన్ (2021) గార్లపాటి ప్రణిత పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ప్రణిత మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ చేపట్టడమే కాకుండా.. నాలుగు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగిస్తుండటం గొప్ప విషయం అన్నారు.
రేపటి తరాలకు మంచి ఆక్సిజన్ అందాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. అనంతరం కోచ్ రమేష్ కుమార్, చంద్ర శేఖర్ కుములి, మధు వర్షిణికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.