చిక్కడపల్లి : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్వామి వారిని దర్శించుకున్నారు.
దేవాలయం ప్రాంగణంలోని శ్రీ లింగేశ్వర స్వామి స్వామి కి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏకవార రుద్రాభిషేకములు,ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు స్వర్ణ పుష్పార్చనలు,సాయంత్రం 6 గంటలకు ఉమామహేశ్వర కల్యాణం, రాత్రి 9 గంటల నుండి మహన్యాస పూర్వక రుద్రాభిషేకములు నిర్వహించారు.
ఈఓ దీప్తి కార్యక్రమాలను పర్యవేక్షించారు. టీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, , పార్టీ సీనియర్నాయకుడు ముఠా నరేశ్, డివిజన్ అధ్యక్షుడు రాకేశ్ కుమార్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా,మారిశెట్టి నర్సింగ్ రావు ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లలిత పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్,ముఠా జయసింహ తదితరుల పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీ ఆంజనేయ స్వామిదేవాలయంలో
చిక్కడపల్లిని శ్రీ ఆంజనేయ స్వామిదేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, 9.30 నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు ఏకవార రుద్రాభిషేకములు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఏకవార రుద్రాభిషేకముల..
రాత్రి 10 గంటలకు శ్రీ మహన్యసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, శివపార్వాతుల కలాయణోత్సవం వేడుకుగ నిర్వహించారు. దేవాలయం కార్యనిర్వహణాధికారి మాచర్ల దేవనాదం కార్యక్రమాలు పర్యవేక్షించారు.
శ్రీ వెంటేశ్వర స్వామి దేవాలయంలో
నగరంలో ప్రసిద్ధి గాంచిన చిక్కడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయంలో ప్రాంగణంలో శివాలయంలో ప్రత్యేక పూజా కర్యక్రమాలు నిర్వహించారు. దేవాలయం కార్యనిర్వహణాధికారి రామాంజనేయులు, ఆలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీనాథ్ గౌడ్ కార్యక్రమాలు పర్యవేక్షించారు.